హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్ గోయల్ అన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 84.5శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం జరిగిన ఉపఎన్నికలో రాత్రి 7గంటల వరకు 86.33శాతం పోలింగ్ నమోదైంది. అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ఫిర్యాదులపై కేసులు కూడా నమోదు చేశారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు సీజ్ చేశాం. నవంబర్ 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది’’ అని గోయల్ తెలిపారు
previous post
next post