సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు బాలాజీ నాయక్ హుజూర్ నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులను,కార్యదర్శులను,ప్రచార కార్యదర్శులను,ఇంచార్జీ లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
చింతలపాలెం మండలం పిక్లా నాయక్ తండ కు చెందిన లకావత్ సైదులు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా,చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన మల్లెల నాగిరెడ్డిని కార్యదర్శిగా, హుజూర్ నగర్ పట్టణానికి చెందిన రేపాకుల కోటయ్య,అమరవరం గ్రామానికి చెందిన ఉస్తెల సైదిరెడ్డి, కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన గొట్టేముక్కల నిర్మల ను ఉపాధ్యక్షులుగా,నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పులిచింతల అంజిరెడ్డి, చింతలపాలెం మండలం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా లకావత్ సైదులు ను, మేళ్ళచెరువు మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా బియ్యాల చిన కోటయ్య ను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని,కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని అన్నారు.
నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి ప్రతిపాదనను అనుసరించి రేపాకుల కోటయ్యను బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగిందని అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ తన ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్