పట్టణాన్ని పట్టణ పార్టీని అభివృద్ధి చేయడంలో తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హుజూర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ అన్నారు. నూతనంగా ఎన్నిక అయిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఇక్కడ ఘన సన్మానం జరిగింది.
ఈ సమావేశంలో మాట్లాడుతూ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రామిశెట్టి రాము పాల్గొన్నారు.
ఇంకా, దొంతగాని బుచ్చిబాబు, కార్యదర్శులు మీసాల శరత్, శిల్పా శ్రీను, కార్యవర్గ సభ్యులు సెగ్యం శ్రీను, జితేంద్రుడు, మున్న, గోరు వెంకన్న, దగ్గుల నరేష్, వేముల వెంకటేష్, పారేపల్లి నరసింహారావు తదితరులు కూడా పాల్గొన్నారు.