సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్య రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండలం రామాపురం గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీ మేళ్ళచెరువు మాజీ మండల అధ్యక్షుడిగా కొనసాగిన కొట్టె శ్రీహరి మంగళవారం టిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బండి సంజయ్ బిజెపి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post