హుమన్ రైట్స్ కౌన్సిల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా వాజీద్నగర్ గ్రామానికి చెందిన బండి రామ్మోహన్ ను నియమించినట్లు వాజీద్నగర్ సర్పంచ్ అనుయ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ సంస్థలో గ్రామానికి చెందిన వ్యక్తికి అవకాశం రావడం అభినందనీయమన్నారు.
జాతీయ స్థాయి డైరెక్టర్ ప్రెసిడెంట్ ఆనంద్, నేషనల్ హుమన్ రైట్స్ లీగల్ అడ్వైజర్ కార్తీక్ నియమక పత్రాన్ని అందుకున్నట్లు వారు తెలిపారు. ఆయన నియామకం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.