నిర్మల్ ఎస్ పి సి శశిధర్ రాజు దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ రాజేశ్వర్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. నిర్మల్ పట్టణంలోని గొల్లపేటలో 10 నిరు పేద కుటుంబాలు కూలి పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు.
ఈ పేద కుటుంబాలకు సుమారుగా 28 రోజులుగా కూలి పనులు లేక కుటుంబ పోషణ భారం అయింది. ఎవ్వరు కూలికి పిలవకపోవడంతో ఎటు తోచని పరిస్థితుల్లో కాలనీలో అద్దెకు ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్వర్ కు పరిస్థితిని వివరించారు.
వెంటనే స్పందించిన రాజేశ్వర్ సొంత ఖర్చులతో 25 KG ల బియ్యం, కిరణం సరుకులు, కూరగాయలు కొని జిల్లా ఎస్పీ సమక్షంలో వారికి అందించి ఆకలితో ఉన్న పేదలపై మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, గొల్లపేట కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.