విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల జన్మదినాన్ని పురస్కరించుకుని స్ధానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్ధాయి కబడ్డీ పోటీలను నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి జన్మదినం అంటే నియోజక వర్గంలో పండుగ వాతారణాన్ని తలపిస్తోందన్నారు.
పలు సేవా కార్యక్రమాలతో పాటు జిల్లా స్ధాయి క్రీడా పోటీలను కూడా నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం ఎంతైనా అభినందనీయం అన్నారు.రాజీవ్ క్రీడా మైదానం అభివృద్ధిచేసి ప్రజలకు అన్ని వసతులతో అందుబాటులోకి తెచ్చిన ఘనత శాసన సభ్యులు కోలగట్లదే అన్నారు.
క్రీడాకారులు క్రీడా స్పూర్తితో నడుచుకుని పోటీలను ఆస్వాదించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ,వైఎస్సారెస్పీ యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌసిక్,కార్పోరేటర్లు తవిటిరాజు,కనకల నాగవల్లి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కనకల సుజాత, కనకల కృష్ణ ,జిల్లా కోచ్ లు పిఈటీలు తదితరులు పాల్గొన్నారు.