కరోనా వైరస్ వ్యాప్తి ఆశించిన రీతిలో తగ్గుముఖం పట్టినందున దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. నగర జీవితం, వాణిజ్య కార్యకలాపాలపై నిషేధాలు సడిలిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని అందువల్ల ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని ఆయన ప్రకటించారు.
ఐరోపా దేశాలలో ఇదే విధంగా ఆంక్షల సడలింపులు ఇచ్చారని, దాంతో కేసులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. కేసులు పెరిగిపోతే మనవద్ద అన్ని ఐసీయూలు లేవని ప్రజలు భారీ స్థాయిలో చనిపోతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన వెల్లడించారు. పిజ్జా డెలివరి బాయ్ ద్వారా కరోనా వ్యాప్తిచెందిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సడలింపులు ఇచ్చే వీలు లేదని ఆయన ప్రకటించారు.