నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో గడియారం సెంటర్ నడిబొడ్డున ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ దేవస్థానం ఆలయం లో సోమవారం సివి రామన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు చే హుండీలను లెక్కింపు చేశారు. గత ఏడాది డిసెంబర్ నెల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకూ పోలేరమ్మ అమ్మవారి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా లక్ష 84 వేల పది రూపాయిలు భక్తుల ద్వారా లభించిందని ఆలయ ఈవో వర ప్రసాద్ తెలిపారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది 20వేల రూపాయలు ఎక్కువగా లభించిందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి నాయుడుపేట ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు,బి ఎల్ శ్రీనివాసులు,మునిరాజా, సిద్దయ్య, రిటైడ్ ఎస్సై శ్యామ్,దొంతాల రాజశేఖర్,బిజెపి నాయకులు కొప్పోలు సుబ్రమణ్యం,ఎన్ ఎస్ జెమిని,జనార్దన్ యాదవ్,యుసేశ్వర్ రాజు,సి.వి.రామన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు