కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాతృమూర్తి గంప రాజమ్మ గురువారం మధ్యాహ్నం హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మృతి చెందారు. సాయంత్రం ఆమె పార్థివ దేహాన్ని స్వగ్రామమైన బస్వాపూర్ గ్రామానికి తరలించారు. నేడు గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బిబిపాటిల్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ రాజమ్మ పార్థివ దేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాలులర్పించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను పరమార్షించి ధైర్యం చెప్పారు. మంత్రి, స్పీకర్, ఎంపీ, ఎమ్మెల్యేలు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.
గ్రామంలోని వైకుంఠ దామంలో రాజమ్మ చితికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అంత్యక్రియలు నిర్వహించారు. పరామర్శించిన వారిలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, కామారెడ్డి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దొత్రే, జిల్లా అధికారులు, టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.