గత మూడు రోజులుగా తెలంగాణ లో బ్రిడ్జి ప్రమదాలు హడలగొడుతున్నాయి.వంతెనలపై నుండి కిందకు పదుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.అలాంటి ఘటనే హైదరాబాద్ లో ని భరత్నగర్ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.