28.7 C
Hyderabad
April 28, 2024 08: 39 AM
Slider అనంతపురం

పుంగనూరులో అల్లరిమూకలు విధ్వంసం చేయడం దారుణం

పుంగనూరులో టి డి పి అల్లరిమూకలు విధ్వంసం చేయడం దారుణమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చంద్రబాబు జిల్లా పర్యటన చేస్తున్నారన్నారు.మొన్న పులివెందులలో తన ఇష్టానుసారం మాట్లాడారని,అలాగే తంబళ్లపల్లెకు వచ్చి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పైన ఇష్టానుసారంగా మాట్లాడి, వ్యక్తిగత దూషణలకు దిగడం,అలాగే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా చేయడం చేస్తున్నారన్నారు.

టిడిపి నాయకుల వాహనాలలో అనుమతి లేని తుపాకులు, బుల్లెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. టి డి పి వాళ్ళు రాష్ట్రాన్ని రణరంగంగా మార్చే కుట్ర పన్నారన్నారు.అలాగే ముందస్తు పన్నాగం ప్రకారం పెద్దిరెడ్డి కుటుంబంను డిగ్రేడ్ చేయడం కోసం , పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్లో వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం తన పర్యటన పెట్టుకుని తరమండ్ర, కొట్టండి రా, ఆ నా కొడుకులని అంటూ.. తీవ్ర పదజాలంతో ఇలా ఎంతవరకు రెచ్చగొట్టడం సమంజసమని ఆయన ప్రశ్నించారు. అలాగే పోలీసుల కలిగిన గాయాలు చాలా బాధాకరమన్నారు.

ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్న వాళ్ల మీద రాళ్లు వేయడం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం, పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతినే విధంగా ప్రవర్తించడం సిగ్గులేని చర్యగా ఆయన దుయ్యబట్టారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంఎల్ఏ ద్వారకనాథ్ రెడ్డి లు అయ్యప్ప మాల ధారణలలో ఉన్నారని తెలిసి కూడా ఇలా చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఇమేజ్ కోల్పోయినా తన ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.చంద్రబాబు, లోకేష్ ,పవన్ కళ్యాణ్ లు ఏదో ఒక పక్క కుట్రలు పన్నుతూ రెచ్చగొట్టే విధానాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. పోలీసుల రక్షణ లేకుంటే అడుగు బయట పెట్టలేని వీళ్ళు పోలీసులపైనే దాడులు చేయడం బాధాకరమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Related posts

బాలు ఆత్మ శాంతించాలంటే?

Satyam NEWS

చంద్రబాబు ఇంటి బందోబస్తు పోలీసుకు కరోనా

Satyam NEWS

అందరూ పండ్ల మొక్కలు నాటితే మంచిది

Satyam NEWS

Leave a Comment