నెల్లూరు కోర్టు ఆవరణలో జరిగిన చోరీ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి నిందితుడుగా ఉన్న ఒక కేసుకు సంబంధించిన ఫైలను ఎవరో చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీకి సంబంధించి మంత్రిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ అనుమానాలపై స్పందిస్తూ ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధం అని మంత్రి వెల్లడించారు. చోరీ ఘటన, పార్టీలోని అసమ్మతి తదితర అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించుకోవచ్చు. హైకోర్టు స్థాయిలో కూడా విచారణ చేయించుకోవచ్చు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రభుత్వ విచారణ కూడా చేయించుకోవచ్చు. ప్రభుత్వ విచారణ తర్వాత ఎలాంటి విచారణకైనా సిద్ధం అని మంత్రి కాకాణి చెప్పారు. అలాగే తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని, పార్టీలో అందరం కలసి పని చేస్తామని చెప్పారు.