ఈ నెల 20 వ తేదీన ఉదయం 11.00 గంటలకు తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లాస్థాయి TRS పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, TRS పార్టీ జిల్లా అద్యక్షులు, జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 27 వ తేదీన TRS పార్టీ 21 వ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని ప్రాంతాలలో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిధిలోని MLC లు, MLA లు, కార్పోరేషన్ చైర్మన్ లు, మాజీ చైర్మన్ లు, TRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జి లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ డివిజన్ అద్యక్షులు పాల్గొంటారని ఆయన తెలిపారు.