28.7 C
Hyderabad
April 27, 2024 03: 20 AM
Slider తెలంగాణ

బర్త్ డే గిఫ్ట్: అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం

Indrakaran-Reddy

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి  కేసీయార్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరిచుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) శోభతో మంత్రి మాట్లాడారు.  అడవుల సంక్షణ, పునరుద్దరణపై ప్రజల్లోనూ విస్త్రత అవగాహన కల్పించే దిశగా అటవీ శాఖ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి సూచించారు.  సీఎం ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పని చేయాలన్నారు.

Related posts

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS

పోలీసుల అదుపులో అంతర్ రాష్ట్ర స్మగ్లర్ బాషా భాయ్..

Sub Editor

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment