ఈ రోజు సిబిఐటి కళాశాల లో ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థుల శాఖ ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్ పర్సన్ డాక్టర్ దివ్య నల్ల ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు. స్టూడెంట్ బ్రాంచ్ని స్థాపించడం వల్ల విద్యార్థులు వివిధ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ సభ్యులతో వివిధ అంశాలు గురించి చర్చించగలుగుతారని అన్నారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో, అదే సమయంలో వారి నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. వి. నరసింహులు మాట్లాడుతూ దేశ సాంకేతిక పురోగతికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి మానవ ప్రయత్నం, నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, సమగ్రపరచడం ఎలాగో తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థి వ్యవహారాల డైరెక్టర్ డా. పి.వి. ఆర్. రవీంద్రారెడ్డి, ఎఇసి డైరెక్టర్ డా.సురేష్ పబ్బోజు, ఐఇఇఇ సిబిఐటి స్టూడెంట్ చాప్టర్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డా. జి. మల్లిఖార్జునరావు, ఐటి విభాగాధిపతి డా. రజనీకాంత్ అలువాలు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఉన్నారు.
కొన్ని సంవత్సరాలుగా సీబీఐటీలో క్లబ్బులు ఎలా పనిచేస్తున్నాయనే దాని గురించి రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ రజనీకాంత్ ఐఇఇఇ చరిత్ర, వృత్తిపరమైన ప్రయాణంలో ఐఇఇఇ ప్రాముఖ్యత గురించి వివరించారు. డాక్టర్ మలికార్జున్ కళాశాల లో ఐఇఇఇ క్లబ్ క్రింద నడుస్తున్న వివిధ సంఘాల గురించి, ఈ క్లబ్లు విద్యార్థులకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎలా సహాయపడుతున్నాయో వివరించారు. ఐఇఇఇ సిబిఐటి అధ్యాపక సలహాదారు స్వాతి సౌమ్య ఈ సంవత్సరం కోసం జరపబోయే తాత్కాలిక కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ యెన్ పునీత్ శర్మ మరియు విద్యార్థులు హాజరయ్యారు