అభివృద్ధి పేరుతో రాజకీయ ప్రచారాలు చేసుకుంటూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తామంటే సహించేది లేదని, అట్లాంటి పర్యటనను అడ్డుకుంటామని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మద్దాల ప్రభాకర్ షేక్ బషీరుద్దీన్ లో అన్నారు.స్థానిక సంఘం కార్యాలయంలో చింతల రమేష్ అధ్యక్షులు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ఖమ్మం పర్యటన అడ్డుకుంటామని, గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆర్భాటంగా అభివృద్ధి పేరుతోనే రాజకీయ ప్రచారం చేసుకోవడానికి వస్తున్నారని అందుకే అడ్డుకుంటామని ఆయన సందర్భంగా అన్నారు.
నిరుద్యోగ సమస్యలు ఎక్కడ వేసిన గోంగలీ అక్కడే ఉందని మెగా డీఎస్సీ ఏమైందని, గ్రూప్ వన్ గురించి చర్చే లేదని, నిరుద్యోగ భృతి విధివిధాన ఇంతవరకు ప్రకటించలేదని, ఖమ్మం జిల్లా కేంద్రంగా మినీ పరిశ్రమ మాట ఏమైందని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటని, ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ మాట ఏమైందని ఇలాంటి హామీలు పోయిన ఎన్నికల ముందు ఇచ్చి మళ్లీ హామీలు ఇచ్చే దానికోసం పర్యటనలు అంటే ఖమ్మం జిల్లా ప్రజలు, నిరుద్యోగులు చూస్తూ ఊరుకోరని అని అన్నారు.
ప్రభుత్వ హాస్టల్ హై స్కూల్స్ లో అనేక సమస్యలు ఉన్నాయని వీటి గురించి మాట్లాడాలని ఆయన అన్నారు. అభివృద్ధి పేరుతో రాజకీయ ప్రచారం కోసం వస్తున్నారని నిజమైన అభివృద్ధిని ఎప్పుడూ డివైఎఫ్ఐ అడ్డుకోదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.