40.2 C
Hyderabad
April 29, 2024 15: 12 PM
Slider ప్రత్యేకం

చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ధనబలం

#raghuramaraju

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటు అనుకుంటే పొరపాటు. ఇది ప్రజాస్పందన. ప్రజల్లో మార్పు మొదలైంది. రకరకాల కాంబినేషన్ వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఓడించారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇది ఓవరాల్ ప్రజాస్పందన. ప్రజలు ఇలాగే డిసైడ్ అయిపోయారు. గత రెండున్నర ఏళ్లుగా  ఇదే విషయాన్ని తాను చెబుతున్నాను.

అయినా నన్ను అక్రమ కేసులలో అరెస్టు చేసి చితకబాదారు. అయినా, తాను నిజం చెప్పడం ఆపలేదు.  అధికార పార్టీ చాప్టర్ క్లోజ్ అయిందని ఆయన అన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడిన  ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన తర్వాత,ఇప్పటి వరకు భయంతో భయపడిన ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ధైర్యంగా బయటకు వచ్చారు. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని, ఇంకా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ధైర్యంతో  వారంతా బయటకు వచ్చారని తెలిపారు.

రోజు,  రోజుకి ఈ ధైర్యం ఎక్కువ అవుతుందన్నడం లో సందేహం లేదు. కడప, కర్నూలు, అనంతపురం పాత జిల్లాలకు చెందిన పశ్చిమ రాయలసీమ టీడీపీ అభ్యర్థి  భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏ ఒక్క ఓటర్ కు రూపాయి పంచలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  బూతుల వద్దే  ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. టిడిపి అభ్యర్థులు  చిరంజీవి, శ్రీకాంత్ లు కూడా ఓటర్లకు ఒక్క రూపాయ పంచిన దాఖలాలు లేవన్నారు.

వెన్నపూస రెడ్డి వెన్నపూస కరిగినట్లుగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ, అధికారపక్షానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎన్నికల్లో డబ్బుల ప్రభావం కేవలం  కొద్దిగా మాత్రమే చూపిస్తుందని అధికార,  ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని సూచించారు. తమ పార్టీ నాయకులు  1000 నుంచి మొదలుకొని 5000 రూపాయల వరకు ఖర్చు చేసినప్పటికీ, గతంలో తమ పార్టీకి వచ్చినట్లుగా  50% మెజార్టీ టిడిపి అభ్యర్థులకు వచ్చిందన్నారు.

ఎన్నికల్లో ధనం పనిచేయదని, మా పార్టీ నేతల సరదా తీర్చడానికి జనం డబ్బులు తీసుకున్నప్పటికీ ఓటువేయలేదు. ఓటు కోసం డబ్బులు తీసుకోవద్దని అంతరాత్మ ప్రబోధం మేరకే  ఓటు వేయాలి. ప్రజలు పడిన కష్టాలు, నష్టాలు బేరిజు వేసుకొని ఓటు వేయాలన్నారు. ఓటుకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అంటే,  జనసేన అధినేత చెప్పినట్టుగా రోజుకు 30 నుంచి 50 పైసల మేరకు  ఇచ్చినట్లే. ప్రజలపై మాత్రం  రోజుకు 25 రూపాయల పన్నులు విధిస్తున్నారు.

అర్ధ రూపాయి కోసం కాకుండా, పాప పరిహారం కోసం పైసలు ఇస్తామంటే తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని దేవుడి హుండీ లో పైసలు వేసినట్లుగా, ప్రజలే దేవుళ్లను కొని డబ్బులు ఇస్తే స్వీకరించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం ఉండదు

రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం ఉండదని, ప్రతిపక్ష పార్టీలో ప్రజా సమస్యలపై పోరాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. టిడిపి,  జనసేన తో పాటు వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే, క్వాలిటీ నేతలు వెలుగులోకి వస్తారు. జగనన్న టెంపరరీ  విద్యా దీవెనలో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటు హక్కు నమోదు చేసుకున్న రెండు,  మూడవ తరగతి చదివినవారు రెండు పక్కన ఒకటి వేయాలని చెబితే, ఒకటి పక్కన ఒకటి వేసినట్లు తెలిసిందన్నారు.

వై నాట్ 175 పోయిందని, ప్రస్తుతం అన్ని ఊర్లు తిరుగుతానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, అంటే రాష్ట్రవ్యాప్తంగా  వృక్షాలు కనపడకుండా చేస్తారా? అనే ఆందోళనలో వృక్ష ప్రేమికులు ఉన్నారు. ప్రస్తుతానికి కొట్టేసిన వృక్షాలు చాలని, ఇకపై వృక్షాలను నరకవద్దని  జగన్మోహన్ రెడ్డిని వృక్ష ప్రేమికులు కోరుతున్నారని  రఘురామకృష్ణంరాజు తెలిపారు.

విశాఖకు వస్తానంటే వద్దంటున్న ప్రజలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కు వస్తానని చెబితే, స్థానిక ప్రజలు వద్దని  ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిని  మెగాస్టార్ చిరంజీవిని చేసినంత పని చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. విశాఖపట్నం కి తాను రానని, తప్పైపోయింది అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ముఖ్యమంత్రి తీసుకున్న ఒక దరిద్రపు నిర్ణయం వల్ల పరిస్థితి తిరగబడింది అన్నారు.

పార్టీ అధ్యక్షుడి హోదా లో అమరావతి  యే రాష్ట్ర రాజధాని అని చెప్పి, ముఖ్యమంత్రి అయిన తర్వాత  విశాఖపట్టణానికి  రాజధానిని మారుస్తానని చెప్పడం, మంత్రులు వందిమాగాదుల మాదిరిగా  మద్దతునివ్వడం వల్లే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని రఘురామకృష్ణంరాజు తెలిపా రు.  ప్రజలు ధైర్యంగా నిలబడేందుకు  సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పై  ప్రజలకు నమ్మకం  ఉంది.

వారు తమకు అండగా ఉంటారని  ప్రజలు భావిస్తున్నారు. వారిద్దరు తమకు అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకూడదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్  భావిస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు  తెలిపారు. తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓటు బ్యాంకు ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఎన్ని తప్పులు చేసినా 25% ఓటు బ్యాంకు  ఉంటుంది. మిగిలిన 35 శాతం ఓటు బ్యాంకును చీలకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన  బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష నేతలపై ఉన్నదని చెప్పారు.

తీవ్రంగా వైఎస్ వివేక హత్య ప్రభావం

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభావం తీవ్రంగా కనిపించింది. తన వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు చూస్తే, రానున్న ఎన్నికల్లో 10 స్థానాలకు పరిమితమైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని  ఆయన అభిప్రాయపడ్డారు.  విశాఖను రాజధాని కావాలని  ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని గతంలో పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి  ఇది ప్రజల అభిప్రాయమని గోబెల్స్ ప్రచారం చేయాలని చూశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 నుంచి 60 కోట్ల రూపాయలు చేసినప్పటికీ, కాంతారా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన ట్లు, పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినట్లు గా తమ పార్టీ నేతల పరిస్థితి తయారయింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి  మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు లలో ఒకరు రాజీనామా చేస్తారా?, లేకపోతే ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తారా?? అన్నది తేల్చుకోవాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఇద్దరు రాజీనామా చేస్తే, వారి దూల తీర్చడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో  విశాఖకు రావద్దు బాబు అని పోస్టర్లు వేస్తే…నేను విశాఖకు వస్తాను… విశాఖలోనే మకాం పెడతానని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పులివెందులలోనే 2300 మెజారిటీ

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో  భాగంగా పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 6000 మంది పట్టభద్రులు ఉంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి  2300 మెజారిటీ  లభించడం పరిశీలిస్తే తమ పార్టీ పని అయిపోయినట్లేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. పులివెందులలోనే ఈ పరిస్థితి ఉంటే, శ్రీకాకుళం నుంచి మొదలుకొని హిందూపురం వరకు అదే పరిస్థితి నెలపొంది. అలాగే ,  తూర్పు,పశ్చిమ

గోదావరి జిల్లాలకు కూడా ఎన్నికలు జరిగి ఉంటే  అధికార పార్టీ అభ్యర్థి   తుక్కుతుక్కుగా ఓడిపోయే వారు . పులివెందులలోనే పరిస్థితి ఇలా ఉండగా , కుప్పం నియోజకవర్గ కూడా గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం  హాస్యాస్పదం. వై నాట్ 175 అంటున్న వారు, వాట్ అబౌట్ 108 గురించి ఆలోచించాలి. ఇది ఒక పట్టభద్రుల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది ప్రజాస్పందన. ప్రజల్లో మార్పు మొదలయ్యిందని, అధికార పార్టీ  అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Related posts

బాలలు దేశంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి

Satyam NEWS

హ్యాట్సాఫ్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి

Satyam NEWS

శ్రీశైలమల్లన్న స్పర్శదర్శనం పునప్రారంభం..

Satyam NEWS

Leave a Comment