పసుపు పంట కు కేంద్రం మద్దతు ధర ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నదని, దీని కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించడం లేదని ఎంపీ ఆర్వింద్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కంఠేశ్వర్ వద్ద గల రేషన్ షాపులో కేంద్రం ఇచ్చిన కిలో కందిపప్పు, బియ్యంను ఆయన నేడు పంపిణీ చేశారు.
లాక్ డౌన్ లో కేంద్రం రాష్ట్రానికి ఐదు కిలోల బియ్యం తో పాటు కంది పప్పు అందజేసిందన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితులలో నానా ఇబ్బందులు పడుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా వినియోగించుకోవడంలేదని ఆయన విమర్శించారు.