గత 20 సంవత్సరాల నుండి హసీనాపురం డివిజన్లోని నందనవనంలో ఉంటున్న స్థానికులను అధికార పార్టీకి బంధించిన నాయకులు బెదిరించడం సరైనది కాదని జక్కా యాదగిరి అన్నారు. వారి నివాసాలు వాళ్లకు వచ్చేంతవరకు డుంటామని, ఎవరు బెదిరించిన బెదిరేది లేదని స్థానికులకు ఇళ్లను కేటాయించకుండా నికేతరులకు ఇళ్లను కేటాయించడం లో మతలబు ఏంటని ప్రశ్నించారు. 32 బ్లాక్ లలో ఉంటున్న 512 కుటుంబాలకు బీఎస్పీ పార్టీ అధికారికంగా ఇల్లు కేటాయించేంతవరకు, చివరి వరకు పోరాడుతామని అన్నారు. అధికార పార్టీ వాళ్లు చోటా మోట నాయకులతో నందనవనం లో ఉంటున్న కుటుంబాలను బెదిరిస్తున్నారని ఇక్కడ ఉంటున్న వారే నిజమైన అర్హులని వాళ్లకి ఇల్లు వచ్చేలాగా ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీదేవి రెడ్డి సుధీర్ రెడ్డి ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి సంపత్ కుమార్, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షులు కట్ల కుమార్, నరేష్, సత్యం, శ్రీను, కొండల్ తదితరులు పాల్గొన్నారు
previous post