32.2 C
Hyderabad
May 2, 2024 00: 04 AM
Slider ముఖ్యంశాలు

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శానంపూడి సైదిరెడ్డి

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య ఉప కేంద్రానికి 14లక్షలు, బస్ షెల్టర్ కి 4 లక్షలు,అంగన్వాడి నూతన భవనానికి 7లక్షలు, మధ్యాహ్న భోజనం వంట గది నిర్మాణానికి 5లక్షల రూపాయల మేరకు పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులను ఉద్దేశించి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ  చేసినప్పుడు తాళ్ల మల్కాపురం ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని,విద్యార్థులకు సన్న బియ్యం పెడుతున్న ఘనత  సిఎం కెసిఆర్ కే దక్కుతుందని,పల్లెలు అభివృద్ధి అయితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, అందుకనే సిఎం కెసిఆర్ పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడిపించేలా పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. దీంతో పల్లెలకు వైకుంఠ ధామం,సిసి రోడ్లు,వైద్యం అందక ఎవరు ఇబ్బంది చెందకూడదు అనే ఆలోచనతో వైద్యశాలల నిర్మాణాలు ఇలా ఎన్నో రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వివక్షను గుర్తించి పంట మార్పిడి విధానం పై దృష్టి సారించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

భారత్ బచావో ప్రదర్శనకు తెలంగాణ నుంచి 4 వేల మంది

Satyam NEWS

కరోనా అవేర్ నెస్: పసి వయసులోనే పెద్ద ఆలోచన

Satyam NEWS

పొంగులేటీ….? చివరకు ఇదా నీ పరిస్థితి?

Bhavani

Leave a Comment