అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చెయ్యేరు వరద బాధితునికి జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ సాయం చేశారు. బుధవారం చెయ్యరు వరద బాధిత కుటుంబానికి పోషణ కోసం 20 వేల రూపాయలు, ఇంటి నిర్మాణం 75 వేలు ఆయన అందజేశారు.2021 సెప్టెంబర్ లో చెయ్యరు కు వరద పోటెత్తడంతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయింది. పరివాహక ప్రాంతాలు, అపారా,ఆస్తి,ప్రాణ నష్టం వాటిల్లింది. ఇందులో శివారెడ్డి అనే బాధితుడు ఇండ్లు,పశువులు,భూమి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాడు.
కొడుకు,కూతురు తో కలిసి చిన్న తాత్కాలిక ప్లాస్టిక్ పట్టల ఇంటిలో జీవనం గడిపేవాడు. అధికార పార్టీ నేతలను,అధికారు లను అందరిని కలిసినా ఎవరూ సహాయం చేయక పోవడంతో జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ ముందుకు వచ్చి సహాయం అందించారు. ఇందులో భాగంగా కుటుంబ పోషణ కోసం గతంలో 25 ఇవ్వగా, ఇంటి నిర్మాణం కోసం 75 వేలు బుధవారం మలిశెట్టి వెంకట రమణ రాయల్ ప్రతినిధులు అందజేశారు. గతంలో 20 వేలు మరోసారి 75 వేలు ఆర్థిక సహాయం ఇవ్వడంపై బాధిత కుటుంబం హర్షం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్సేల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయ కులు భాస్కర పంతులు,చెక్ డ్యామ్ వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు,సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.