ఐఐటీ జేఈఈ ఫోరం -ఇండియా ఎడిషన్ బుక్ లెట్ ను జనసేన తిరుపతి నియోజకవర్గం ఇంచార్జి కిరణ్ రాయల్ ఆవిష్కరించారు. 2014-2019 మధ్య కాలంలోని ఆరు సంవత్సరాల జేఈఈ(అడ్వాన్స్డ్ ) సమాచార విశ్లేషణ ఇందులో ఉంటుంది. ఈ పుస్తకాన్ని సంక్రాంతి సందర్భంగా తిరుపతి మార్కెట్ లోకి విడుదల చేసారు.
ఈ సందర్భం గా కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఈ పుస్తకం ఐఐటీ ఔత్సాహికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియచేసారు. ఈ పుస్తకంలోని సమాచారం, రచయిత కె.లలిత్ కుమార్ విశ్లేషణ, అంశాలను వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందన్నారు. విద్యార్థుల ర్యాంకులు, సీట్లు కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, తదితర సమాచారాన్ని అందించడం అభినందనీయమని ఆయన అన్నారు.