మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలో వీరనారి చాకలి ఐలమ్మ 126 జయంతి సందర్భంగా తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈసీఐఎల్ చౌరస్తాలోని వీరనారి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,భూమి కోసం,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పెత్తందారీ వ్యవస్థ కు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ స్ఫూర్తి, నేటి యువతకు, మహిళలకు, అందించాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ టి పి సి సి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి.నిర్వాహకులు అశోక్ రాములు సకినాల రవి. సోమయ్య సత్యనారాయణ కర్ణాకర్ నాగరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు