25.2 C
Hyderabad
May 8, 2024 10: 55 AM
Slider కడప

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పతి పాలన విధించాలి

bhatyala 27

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ పేయిడ్ ఆర్టిస్టులు పోలీసుల రక్షణ తో విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయడం హైయమైన చర్య అని టీడీపీ రాజంపేట ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు అన్నారు. విశాఖలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర తో వైసీపీ నేతల భూ మాఫియా గుట్టు రట్టు ఔతుందనే భయం నెలకొందని అందుకే గుండాలతో దాడులకు ఉసి కొల్పారని ఆయన అన్నారు.

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ నేత డాక్టర్ సుధాకర్, మన్నూరు రాజా, మళ్ళెం తిరుపాలు, భారాతాల శ్రీధర్ బాబు, పొలిశివా, ప్రతాప్ రాజు, సుబ్రమణ్యం నాయుడు, బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు, దరూరు కృష్ణ చైతన్య, దాసరి కళాధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భత్యాల చెంగల రాయుడు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత గా జైలు కెళ్ళి నప్పుడు..వారం వారం నాంపల్లి కోర్టుకు వెళ్లి నప్పుడు ..పాదయాత్ర చేసినప్పుడు..అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తి పోలీసు భద్రత కలిపించిందని అన్నారు.

అప్పట్లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఇలాగే చేసే అధికారం ఉన్నప్పటికీ చేయలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ నిఘా విభాగం వైఫల్యం చెందిందని, జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఎపి లో రాష్ట్ర పతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

Related posts

వచ్చేనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు

Satyam NEWS

తపన

Satyam NEWS

మెక్సికోలో ఘోర ప్రమాదం.. 49 మంది కూలీల దుర్మరణం

Sub Editor

Leave a Comment