కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి లో గురువారం పోలీసుల బందోబస్తు మధ్య ఏసిబి దాడులు రాత్రి కూడా కొనసాగాయి. ఏసీబీ సోదాలల్లో ఏసీబీ డిఎస్పీ జనార్ధన్ నాయుడు,సి.ఐ లు రెడ్డప్ప ,శ్రీనివాసరెడ్డి, యస్.ఐ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఎసిబి సోదాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా రాజంపేట ఆసుపత్రిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ డిఎస్పీ జనార్ధన్ నాయుడు తెలిపారు. కాగా ఇంకా ఎసిబి దాడులు శుక్రవారం కూడా కొనసాగుతాయని తనిఖీ లు అనంతరం నివేదిక ప్రభుత్వం కు అందజేస్తామని ఆయన తెలిపారు.