అన్నమయ్య జిల్లా నందలూరు లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వాలంటీర్ల ర్యాలీ,మానవ హారం నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శన అరవపల్లె పంచాయతీ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది.ఈ ర్యాలీలో వాలంటిర్లు బ్యానర్లు, ప్లే కార్డులు చేత బట్టి పావలా కళ్యాణ్ డౌన్ డౌన్,ప్యాకేజి కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బస్ స్టాండ్ కూడలిలో హైవే పై మానవ హారం గా ఏర్పడ్డారు.దీనితో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచి పోయినాయి.