నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో శనివారం వందమంది వైసీపీలో చేరారు. వైసిపి సీనియర్ నేత పిండి సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నగర్ నుంచి వందమందికి పైగా వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ పార్టీలో తనకు మద్దతుగా చేరిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో వారికి చేదోడువాదోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
వైసిపి నేత నుండి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు నగర్ లోని 1500 కుటుంబాలు ఎంపీ ఆదాలకు, వైసీపీకి మద్దతుగా ఉంటాయని, రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీని తెప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వైసీపీ నేతలు పిండి సురేష్, ఆసిఫ్, పాలకీర్తి రవి, యేసు నాయుడు, నవీన్ ప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.