33.7 C
Hyderabad
April 30, 2024 01: 17 AM
Slider ప్రత్యేకం

ఆంధ్రా సమాజానికి అన్యాయం చేస్తున్న తెలంగాణ దొర

#vishnuBJP

ఆంధ్రా రైతులపై కడుపు మంటతో కృష్ణానదీ జలాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సముద్రం పాలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

పులిచింతలలో తెలంగాణ జెన్‌కో అసందర్భంగా, దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోంది.

దీంతో ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసారు. మరిన్ని గేట్లుఎత్తి వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృధాగా పంపుతున్నారు. ఇది తీరని అన్యాయం అని ఆయన అన్నారు.

మీరు చేసిన అన్యాయం ఆంధ్రా రైతుకు మాత్రమే కాదు. ఈ దేశ రైతులందరికి. మీరు చరిత్రలో రైతు ద్రోహిగా మిగులుతారు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నేటి సమాజం హిట్లర్ ను చూడలేదు, హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్ ని ప్రత్యక్షంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.

మీ అనైతిక అహంకార, పిచ్చి చర్యలను చరిత్ర ఎన్నటికీ మరచిపోదు. స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్న దుర్మార్గాలకు, తెలంగాణ రైతులు సైతం బుద్ది చెప్పే రోజు వస్తుంది అని ఆయన అన్నారు.

Related posts

సామాన్యులకు దడ పుట్టిస్తున్న వంట నూనెలు

Satyam NEWS

కోడెల మరో కథ: అద్దె కొట్టేయ్ రాజా

Satyam NEWS

పోలవరం ప్రాజెక్టులో నాటు పడవ బోల్తా: ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

Satyam NEWS

Leave a Comment