రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల ఇంకా ప్రారంభం కాకముందే…పట్టపగలే ప్రతీ ఒక్కరికీ చుక్కలు చూపిస్తున్నాడు…సూరిబాబు.
తాజాగా రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ…113 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని..అతి జాగ్రత్రగా ఆయా మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాగల రెండు రోజులలో వడగాల్పులు చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.
మొత్తం…113 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 217 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని విపత్తుల నివారణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా గుంటూరులో 29, కృష్ణాలో 27, విజయనగరం 19, విశాఖపట్నం 15 , పశ్చిమ గోదావరి లో 18 , తూర్పు గోదావరి లో 10 శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాల యంత్రాంగాన్ని విపత్తు నివారణ సంస్థ అప్రమత్తం చేసింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్