23.7 C
Hyderabad
May 8, 2024 06: 42 AM
Slider జాతీయం

ఖాట్మండులో ఏడుగురు భారతీయ పర్యాటకుల మృతి

khatmandu

నలుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు మంగళవారం నేపాల్ లోని ఓ హోటల్ లో ఊపిరాడక మృతి చెందారు. రాత్రి సమయంలో వేడి కోసం గ్యాస్ హీటర్ ను ఉపయోగించి వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించిన వారికి ఊపిరి అందలేదు. దాంతో ఒక్కొక్కరుగా వారు మరణించారు.

ఖాట్మండుకు దక్షిణంగా ఉన్న హిల్ రిసార్ట్ అయిన డామన్ లో వారు బసచేశారు. ఇది హిమాలయాలకు అత్యంత చేరువలో ఉంటుంది. ఇక్కడ నుంచి హిమాలయ పర్వతశ్రేణి అతి సమీపంలో కనిపిస్తుంటుంది. గదిని వెచ్చగా ఉంచడం కోసం గ్యాస్ హీటర్ ను పరిమితికి మించి వాడటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

Related posts

ఆర్ధికంగా పతనమైపోయిన ఉక్రెయిన్: మరి కొన్ని దేశాలు కూడా…

Satyam NEWS

టిఆర్ఎస్ కు బ్రాహ్మణుల మద్దతు

Sub Editor

దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల జాబితా ఇవ్వండి

Bhavani

Leave a Comment