యూకె స్ర్టెయిన్ భయంకరమైనది కాదని దీనికి ఎక్కువ చంపే శక్తి లేదని, ఎక్కువ మందికి వ్యాధి వ్యాప్తి చెందిస్తుందని ఇందుకోసం మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నామని, 10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారని, ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దొని, మభ్యపెట్టేలాంటి ప్రచారాలను ప్రసారం చేయొద్దని కోరారు. కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
previous post