ఉత్తరాఖండ్లోని ఔలీలో భారత్, అమెరికా సైన్యాల మధ్య జరిగే వార్షిక సైనిక విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. యుద్ధ అభ్యాస్-2022 పేరుతో సాగే ఈ విన్యాసాలు ఇరు దేశాల సైనికులు కొత్త కొత్త యుద్ధ మెళకువలు నేర్చుకోవడానికి దోహదపడుతుంది. ఉత్తరాఖండ్లోని ఔలి సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఎత్తైన పర్వత ప్రాంతంలో తొలిసారిగా ఓ స్నేహ దేశ సైన్యంతో కలిసి భారత సైన్యం సైనిక విన్యాసాలు చేస్తోంది.
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఔలీ ప్రాంతం చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ కసరత్తు చైనా ఆందోళనను పెంచింది. ఈ యుద్ధ అభ్యాస్ లో ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్, ఫోర్స్ మల్టిప్లైయర్స్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ సర్వైలెన్స్ గ్రిడ్, ఆపరేషనల్ లాజిస్టిక్స్ మరియు మౌంటైన్ వార్ఫేర్ స్కిల్స్ ఉన్నాయి.
ఈ కసరత్తు ఇరు దేశాల సైన్యాలకు తమ అపారమైన అనుభవాలను, నైపుణ్యాలను పంచుకోవడానికి, సమాచార మార్పిడి ద్వారా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ కసరత్తులో, రెండు దేశాల సైన్యం ఒకదానికొకటి ఎత్తైన ప్రదేశంలో సైనిక యుద్ధ వ్యూహం ఎలా ఉండాలి అనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. 12 నెలల పాటు మంచు కురుస్తున్న అలస్కా వంటి అతి శీతల ప్రాంతాలలో యుఎస్ ఆర్మీ కూడా ఉంది.