32.2 C
Hyderabad
May 12, 2024 20: 07 PM
Slider మహబూబ్ నగర్

పరిశ్రమలకు అనుమతులు సకాలంలో ఇవ్వాలి

#gadwala

పరిశ్రమలకు అనుమతులు సకాలంలో ఇవ్వాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో   టీఎస్ ఐపాస్  డిఐపిసి పై పరిశ్రమల శాఖ, ఆర్టీవో,  ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టిఫ్రైడ్ పథకం కింద 12 మంది  ఎస్సీ  లబ్ధిదారులకు, ఒకరు ఎస్టీ లబ్ధిదారుడికి మంజూరు చేశామని ఈ పథకం కింద పురుషులకు 35 శాతం,  స్త్రీలకు 45 శాతం సబ్సిడీ మంజూరు చేశామని ఆయన తెలిపారు.

సమావేశం లో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్  మేనేజర్ యాదగిరి,  ఆర్టీవో పురుషోత్తం రెడ్డి,  ఎస్సీ కార్పొరేషన్ ఇ డి రమేష్ బాబు , టి ఎస్ ఐ ఐ సి మేనేజర్ శ్రీనివాసులు , డి ఐ సి సి ఐ కోఆర్డినేటర్ సోమశేఖర్  సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పౌరసత్వ చట్టంపై ఆగని నిరసనలు

Satyam NEWS

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Satyam NEWS

రైల్వే కోడూరులో సచివాలయ వార్డు వలంటీర్ల ఆందోళన..!

Bhavani

Leave a Comment