తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన జర్నలిస్ట్ కోల నాగేశ్వరరావును ప్రముఖ సినీ నటుడు సుమన్ ఘనంగా సన్మానం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కౌడిన్య ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ కోలాను ఆత్మీయ సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా ఉండి ప్రభుత్వ ఫలాలు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నేషనల్ సెక్రటరీ యరగాని నాగన్న గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,బెల్లంకొండ అమర్ గౌడ్, పండ్ల హుస్సేన్,కడియాల రామకృష్ణ, దొంతగాని రాజా రమేష్,అర్జున్, వల్లపుదాసు నాగరాజు,చింతకాయల రాము,పాశం రామరాజు,చప్పిడి సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్