Slider పశ్చిమగోదావరి

నిన్న కర్నూలు..నేడు ఏలూరు: వైసీపీ దళిత ఎమ్మెల్యే పట్ల వివక్ష

#chintalapudiMLA

నిన్న కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ కు అవమానం జరుగగా నేడు ఏలూరు జిల్లాలో చింతల పూడి దళిత ఎమ్మెల్యే ఎలీజాకు సొంత పార్టీ నేతల నుంచే ఆటంకం ఎదురైంది. ఇక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది. నందికొట్కూరు నియోజక వర్గంలో శనివారం మంత్రి రోజా అధికార పర్యటన సందర్భంగా ఆ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే ఆర్థర్ పేరు, ఫోటోలు ఫ్లెక్సీలలో లేకపోవడంతో అవమానంతో మనస్తాపం చెంది ఆయన మంత్రి రోజా కార్యక్రమాలకు దూరంగా వున్నారు.

ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇదిలా వుండగానే ఏలూరు జిల్లా చింతల పూడి దళిత ఎమ్మెల్యే ఎలీజా నియోజకవర్గంలోని సీతానగరం లో గడప .. గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించగా  ఎంపీ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఏలూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వున్నాయి. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఎలిజా నిర్వహించిన గడప.. గడప కు కార్యక్రమాన్ని ఎంపీ కోటగిరి వర్గీయులు అడ్డు కోవడం.. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

దీంతో ఎమ్మెల్యే ఎలీజా కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. రాష్ట్రంలో అధికార వైసీపీలో దళిత ఎమ్మెల్యే లకు సొంత పార్టీ నేతల నుంచే అడుగడుగునా అవమాన భారం.. వివక్ష పెరుగుతోంది. రాష్ట్రంలో 38 ఎస్ టీ, ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు వుండగా గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండేపి ఒక్క నియోజక వర్గం నియోజకవర్గం మినహా అన్నీ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ అభ్యర్దులు విజయం సాధించారు.

అయితే ఆయా నియాజక వర్గాల్లో గెలిచింది దళితులు.. గిరిజనులు అయినా పెత్తనం అధికార పార్టీ సామాజిక వర్గం లేదా అగ్రకుల నేతల పెత్తనం వుంటుంది. కొన్ని నియోజక వర్గాల్లో పేరుకు ఎమ్మెల్యేలు మాత్రమే.. పెత్తనం అంతా పెత్తందార్లదే. దీనికి ఉదాహరణే కర్నూలు జిల్లా నంది కొట్కూరులో గెలిచింది దళిత ఎమ్మెల్యే ఆర్థర్  అయినా పెత్తనం అంతా బైరెడ్డి శిద్దారెడ్డిదే. ఇది బహిరంగ రహస్యం. ఈ విధంగా అనేక నియోజక వర్గాల్లో పరిస్థితి ఇదే వుందని చెబుతున్నారు.

Related posts

నిరంకుశ పాలనను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య

Satyam NEWS

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సూపర్ స్టార్ కృష్ణ

Satyam NEWS

సౌదీ రోడ్డు ప్రమాదంలో ప్రవాసాంధ్ర కుటుంబం మృతి

Satyam NEWS

Leave a Comment