టూరిస్ట్ వీసాపై కువైట్ నుంచి రియాద్కు వెళ్లిన నలుగురితో కూడిన భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించింది.శుక్రవారం ఉదయం రియాద్ సమీపంలో 6:00 గంటలకు వారు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు ట్రైలర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది కువైట్ లో నివసించే ప్రవా సాంధ్రుడు అయిన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట లో 10 వతరగతి వరకు చదివి బెంగుళూరులో స్థిరపడిన గౌస్ దంతు (35), అతని భార్య తబ్రక్ సర్వర్ (31), వారి పిల్లలు ముహమ్మద్ దామిల్ గౌస్ (2), మహమ్మద్ ఇహాన్ గౌస్ (4) మరణించారు.ప్రమాదంలో వారి వాహనం మరియు ప్రయాణ పత్రాలు ధ్వంసమయ్యాయి.గౌస్ దంతూ గత పదేళ్లుగా కువైట్లో ప్రవాసాంధ్రుడిగా ఉన్నారు.వీరు టూరిస్ట్ వీసాపై కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వచ్చారు. మృతదేహాలను రుమా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు
previous post
next post