మరి కొద్ది రోజుల్లో పరీక్ష రాయాల్సిన ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శివ వీధి కి చెందిన మైలారపు చరణ్ అనే ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో జిల్లా కేంద్రం శివ వీధి లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఇంటి పై చదువుకుంటానని తల్లిదండ్రులతో చెప్పి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.