సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో శుక్రవారం ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు డా.జీ సంజీవరెడ్డి 92వ, జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్ బాయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సలిగంటి జానయ్య ఆధ్వర్యం వహించగా ఈ కార్యక్రమానికి హుజుర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మాల్లిఖార్జున్ రావు ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాల్లిఖార్జున్ రావు మాట్లాడుతూ డాక్టర్ సంజీవరెడ్డి నిరాడంబరత,కార్యసాధన,విలువలతో కూడిన రాజకీయం,ప్రపంచ దేశ కార్మిక నేతగా ఎదిగిన గొప్ప నేత అని అన్నారు. నేటి నాయకులకు,యువతకు సంజీవరెడ్డి ఆదర్శం కావాలని అన్నారు.
సంజీవ్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నో జరుపుకొని కార్మిక లోకానికి వెన్ను దన్నుగా నిలవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నియెజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,యూనియన్ ప్రధానకార్యదర్శి మేకపోతుల వీరబాబు, గడ్డం నాగరాజు,కాకిలేటి సుబ్బారావు, శీలం రాజు,మామిడి ధనమూర్తి,బోడ్డు వీరయ్య,శాసనాల శ్రీను,శీలం రమేష్, మోదాల సీతారాములు,గడ్డం సాయి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్