30.7 C
Hyderabad
April 29, 2024 05: 31 AM
Slider ముఖ్యంశాలు

పిలిచి మంత్రి పదవి ఇస్తే అన్యాయం చేశారు

#kcr

ప్రజల కోసం పనిచేస్తున్నాం, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న బిఆర్ఎస్ ను మరొకసారి గెలిపించి రాష్ట్ర అభివృద్ధికిలో పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గం జీలచెరువులో నిర్వహించిన బిఆర్ఎస్ ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారో వారిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను రద్దు చేస్తారన్నారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలను నమ్మ వద్దన్నారు. కాంట్రాక్టర్గా ఎదిగి డబ్బు అహంకారంతో ప్రజలను గెలవలేరన్నారు. డబ్బు అహంకారం ఉన్న నాయకులు ఓటర్లను గెలవలేరన్నారు.

ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలను తీసుకువచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన చేసింది గుండు సున్నా అన్నారు. స్నేహితుడిగా సీనియర్ నాయకుడిగా అందలం ఎక్కిస్తే టిఆర్ఎస్కు అన్యాయం చేశారన్నారు. అరాచక రాజకీయాల నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. రానున్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమాగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లక్షలాది మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చి గిరిజనల అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ కు పట్టం కట్టాలని అభ్యర్థించారు.

Related posts

పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికైనా పర్మినెంటు చేయండి

Satyam NEWS

చావుతప్పి కన్నలొట్టపోయిన చందంగా ఆస్ట్రేలియా విజయం

Satyam NEWS

కాంగ్రెస్ నేతృత్వంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

Satyam NEWS

Leave a Comment