24.7 C
Hyderabad
February 10, 2025 22: 46 PM
Slider జాతీయం

విక్రమ్ ల్యాండర్ జాడను ఇస్రో ముందే కనిపెట్టింది

santosh sivan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తీవ్రంగా ఖండించారు. చంద్రయాన్‌-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకు ముందే ఆ పని చేసిందని ఆయన పేర్కొన్నారు.

 ‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్‌ విక్రమ్‌ ల్యాండర్‌ జాడను ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్‌సైట్‌లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్‌ చేసుకోండి’ అని శివన్‌ వివరించారు. పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయపడటంతో విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని, శకలాలను నాసా పేర్కొంది.

Related posts

మోడీ మాటలే కమలం విజయ రహస్యం

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 17 నుంచి దసరా ఉత్సవాలు

Satyam NEWS

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam NEWS

Leave a Comment