భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్ శివన్ తీవ్రంగా ఖండించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకు ముందే ఆ పని చేసిందని ఆయన పేర్కొన్నారు.
‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్ విక్రమ్ ల్యాండర్ జాడను ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్సైట్లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి’ అని శివన్ వివరించారు. పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను నాసా పేర్కొంది.