ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతుoడటంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావంతోనే రాగల మూడు రోజుల్లో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నవంబర్ 4వ తేదీ వరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం రాత్రి నగరం వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. 4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, గరిష్ఠంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
previous post
next post