లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్లవేళలా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఐటీసీ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులను ITC Section Incharge గార్గుల పృథ్వి, నిర్మల్ ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ మారుతి ఏజెన్సీ ఆమెడా దేవేందర్ ఈరోజు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బందికి, సాయుధ ధళా సిబ్బందికి, వివిధ శాఖల సిబ్బందికి, అధికారులకు ఈ ఉత్పత్తులను అందజేస్తామని తెలిపారు. అందులో మామ్ మ్యూజిక్ బిస్కెట్లు, సేవ్లాన్ హ్యాండ్ వాష్ ప్యాకెట్లు, సెవ్లాన్ సబ్బులు తదితర ఐటీసీ ఉత్పత్తులు ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.
నిర్మల్ జిల్లా రెడ్ జోన్ పరిధిలో ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రజలు అందరు స్వీయా నిర్బంధంలో ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఐటీసీ సంస్థ యాజమాన్యానికి ఎస్పి ధన్యవాదాలు తెలిపారు.