ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం కోసం కృషి చేయాలని కోరుతూ ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కు వినతిపత్రం సమర్పించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నారని బిక్షపతి ఆయనకు తెలిపారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో కోసం మెడికల్ కళాశాల కోసం ప్రజలు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిక్షపతి అన్నారు. త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అందుకు సహకారం కావాలని కోరారు. పార్టీ జెండాలు ముఖ్యం కాదు ములుగు ప్రాంత సమస్యల సాధన ముఖ్యమని బిక్షపతి అన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఇరుగు పైడి మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య మహాజన సోషలిస్టు పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి జన్ను రవి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుర్ర సతీష్ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి గజ్జల ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
previous post
next post