చెట్టుపై నుంచి కిందపడి గాయపడిన కల్లుగీత కార్మికుడికి కల్లు గీత కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.15,000 చెక్కును బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణరావు నేడు అందచేశారు. ఈ కార్యక్రమంలో కేజీ కేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన చిర్రా వీరస్వామి తన విధి నిర్వహణలో భాగంగా గత నెలలో తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ చెట్టుపై నుండి కింద పడ్డాడు.
సాటి గీత కార్మికులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయాన్ని లక్ష్మీదేవిపేట్ సంఘం అధ్యక్షులు పెరుమండ్ల పున్నం గౌడ్ ప్రధాన కార్యదర్శి మామిండ్ల సంపత్ గౌడ్ ద్వారా కల్లు గీత కార్మిక సంఘం నాయకులకు తెలిపారు. కల్లు గీత కార్పొరేషన్ వెంటనే స్పందించి రూ. 15,000 మంజూరు చేసింది. ఆ చెక్కును నేడు అందించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ మాట్లాడుతూ కల్లు గీత కార్పోరేషన్ నుండి తక్షణ సహాయం అందించడం హర్చించదగ్గ విషయం అన్నారు.
కల్లు గీత కార్పొరేషన్ అందించే తక్షణ సహాయాన్ని 15000 నుండి 25 వేలకు పెంచాలని మృతి చెందిన కుటుంబాలకు 25వేల నుండి 50 వేలకు పెంచాలని అన్నారు. గీత కార్మికులు వృత్తి చేయడంలొ చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలోkg ks జిల్లా నాయకులు దొమ్మటి సదానందం గౌడ్ గౌడ సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.