విజయనగరం జిల్లా కేంద్రం లో..అదీ రాత్రి ఏడున్నర ప్రాంతంలో… ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో మరో ఆర్టీసీ బస్ అకస్మాత్తుగా ఆగిపోయింది. అదీ జిల్లా ఎస్పీ ఉండే అధికార బంగ్లా కు సమీపంలో..మయూరీ జంక్షన్ వద్ద..ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ సాలూరు వెళ్లే ఆర్టీసీ ప్యాసింజర్ బస్…మయూరీ జంక్షన్ లో ఎత్తు బ్రిడ్జి వద్ద….ఎక్కుతుండగా నిలచిపోయింది.అసలే సాయంత్రం..అదీ రద్దీ ఉండే జంక్షన్ లో ఉద్యోగస్తులు ఇండ్లకు వెళ్లే సమయంలో… ఆర్టీసీ బస్ ఆగిపోవడంతో.. ట్రాఫిక్ స్తంభించింది.
వెంటనే ట్రాఫిక్ ఏఎస్ఐ విజయ్ …హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఆగిపోయిన ఆర్టీసీ బస్ ను….ఆపోలో మెడికల్ షాప్ పక్కకు పెట్టించే చర్యలు చేపట్టారు. అయితే అంతలో ఆర్టీసీ డిపో మెకానిక్ సిబ్బంది రావడంతో… బస్ ను బయలుదేరే యత్నం చేసే సమయంలో సరిగ్గా మయూరీ జంక్షన్… అంటే ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వద్ద వచ్చి…. రోడ్ కు అడ్డంగా ఆగిపోయింది. దీంతో మరో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు…రావడంతో… ట్రాఫిక్ సిగ్నల్ ఉండగానే… క్రమబద్ధీకరించారు.
అంతలో ట్రాఫిక్ ఏఎస్ఐ విజయ్…ఎస్పీ మేడం… బంగ్లాకు వచ్చే సమయం కావడంతో… ఆఘమేఘాల మీద బస్సు ను తొలగించే చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఆర్టీసీ మెకానిక్ సిబ్బంది… లోపం కనుక్కుని..ఆయిల్ అయిపోవడంతో… హుటాహుటిన.. తెచ్చి ట్యాంక్ నింపి..బస్సు ను అక్కడ నుంచీ ఆర్ అండ్ బీ వద్దకు తరలించారు.