Slider కడప

టీడీపీ జనసేన కలిస్తే జగన్ రెడ్డి అవుట్

#batyala

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని భయపడుతున్నారని టీడీపీ మాజీ శాసనమండలి సభ్యుడు బత్యాల చెంగల్రాయుడు అన్నారు. 2014లో టీడీపీ జనసేన ఐక్యతతో రాష్ట్రం ప్రయోజనం పొందిందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు, ప్యాకేజీ వంటి పదాలతో రెచ్చగొట్టే కుట్ర ప్రచారంతో మిత్రబేధం సృష్టించి జగన్ రెడ్డి అధికారానికి వచ్చారని ఆయన అన్నారు.

తెలుగుదేశం జనసేనలను విడదీస్తే కనీసం ప్రతిపక్షహోదా అయినా దక్కుతుందని జగన్ రెడ్డి ఆశపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే మాజీ మంత్రి పేర్ని నానితో నేడు జగన్ మరలా పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టేలా అవాకులు, చెవాకులు పేల్చారని బత్యాల చెంగల్రాయుడు అన్నారు. కాపు రిజర్వేషన్లు రద్దు చేస్తే మాట్లాడలేని పేర్నినాని, ఆత్మ వంచన చేసుకుని భయంతో తాడేపల్లి స్క్రిప్టు చదివాడని ఆయన అన్నారు. పేర్ని నాని బానిస బ్రతుకు వదిలి కాపు రిజర్వేషన్ల కోసం, అమరావతి రాజధాని కోసం నిలబడకపోతే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.

Related posts

అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్

Bhavani

ఓ గాడ్: అన్నను చంపేసిన తమ్ముడు

Satyam NEWS

పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్న హోం గార్డ్స్

Satyam NEWS

Leave a Comment