కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం జడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక కార్యక్రమం లో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా విద్యావవస్దలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేయడం జరిగిందన్నారు. నాడు- నేడు ద్వార పాఠశాల ను అదునీ కరించడం విద్యాకానుక ద్వార పాఠశాలలోని పిల్లలు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు అందించడం శుభ పరిణామమని ఉపాధ్యాయులు కూడ అంకిత భావంతో విద్యాబోధన చేపట్టాలని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని విజ్ణప్తి చేశారు.
అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యకానుక కిట్లను అందజేశారు.అనంతరం సర్వహంగులతో ముస్తాబైన పాఠశాల గదులను లాంఛనంగా ప్రారంభించారు.