భార్యను కొట్టి ఆమె తీవ్ర గాయాల పాలు కావడం తో పోలీస్ లకు భయపడిన భర్త పారిపోయి సమీప అడవుల్లో ఉరివేసుకుని చనిపోయిన ఘటన ఇది.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త ఆత్మహత్య చేసుకోగా సోమవారం ఉదయం అతని డెడ్ బాడీ ని గుర్తించారు.వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఆదివారం రాయే లక్ష్మణ్ అనే వ్యక్తి తన భార్య స్వరూపపై గొడ్డలి, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు.
విదేశాలకు వెళ్లి వచ్చిన లక్ష్మణ్ ప్రస్తుతం ఇక్కడే నివసిస్తున్నాడు. తానూ అక్కడినుండి పంపిన డబ్బులు లెక్క తేలాక పోవడం తో భార్యాభర్తలిద్దరూ డబ్బుల కోసమే తరచూ గొడవలు జరిగేవి., ఇదే విషయమై ఆదివారం కూడా డబ్బుల విషయంలోనే గొడవ జరిగిందని , తీవ్ర గాయాల పాలైన స్వరూపను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య స్వరూపపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినన భర్త రాయి లక్ష్మణ్ (45) కేసులు పెడుతూ పోలీసులు వస్తారనే భయం తో మైతపూర్ గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం అతని శవాన్ని తోటలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాయే లక్ష్మణ్-స్వరూప దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. రాయికల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.