రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలుగా ఉన్న బాలివుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయిన సుఖేష్ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సుఖేష్ చంద్రశేఖర్ తన భావోద్వేగాలతో ఆడుకున్నాడని, తన కెరీర్ను నాశనం చేశాడని జాక్వెలిన్ కోర్టులో వెల్లడించింది. జాక్వెలిన్ పాటియాలా కోర్టులో నేడు తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. సుఖేష్ చంద్రశేఖర్ ప్రభుత్వ అధికారి అనే విషయం మాత్రమే తనకు చెప్పారని జాక్వెలిన్ పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖలో అతను అధికారి అనే విషయాన్ని పింకీ ఇరానీ నటి మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముతాతిల్ తనకు చెప్పారని జాక్వెలిన్ తెలిపింది. ఇది కాకుండా, సుఖేష్ తనను సన్ టీవీ యజమానిగా మరియు జె జయలలితను తన అత్తగా అభివర్ణించారని కూడా జాక్వెలిన్ వివరించింది. సుఖేష్ తనకు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని అంతకు ముందే ఒప్పుకున్న జాక్వెలిన్ ఇప్పుడు సుఖేష్ పై ఈ వాంగ్మూలాన్ని ఇచ్చింది.